May 26, 2010

నా సాహస యాత్ర

 
మనం రోజూ  రిక్షా మీద స్కూల్ కి వెళ్ళేవాళ్ళం. ఓ సుభ దినాన ...మా రిక్షా వాడు  జయిగా తాగేసి ఎక్కడో తొంగున్నాడు. అయిదు అయినా  రాలేదు...మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారు. మా రిక్షా లోని పిల్లల్ల్ని వాళ్ళ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్ళిపోయారు..నాన్న వేరే ఊరు వెళ్లారు..ఈలోపులో అమ్మ ఎవర్నో నన్ను తీసుకు రమ్మని పురమాఇంచేసరికి ఆలస్యం అయి ఉంటుంది....నేను ఒక్కడినే ఉండి పోయాను. ఇంగ్లాండ్ కి బైలుదేరిన పార్వతీశం లాగా గుండె దిటవు చేసుకుని...మనం ఏం చేసినా లోక కళ్యాణం కోసమే కదా ఆనుకుని....నడుస్తూ బైలు దేరాను. ఇంటికి  వెళ్లేసరికి మా అమ్మ అరుగు మీద కూర్చుని భోరున ఏడుస్తోంది...ఒకే ఒక్క   కొడుకుని మరి ఆ మాత్రం భాద ఉంటుంది కదా. నన్ను చూడగానే అమాంతం  వాటేసుకు ఇంత సేపు ఏమయ్యావు రా...ఆ దరిద్రపు గొట్టు   రిక్షావాడు నిన్ను కిడ్నాప్ చేసాడేమో అని తెగ కంగారు పడుతున్నాం అని వాడిని వాడి అమ్మని అమ్మ్మమ్మని అందర్నీ తిట్టడం  మొదలెట్టింది. కొంచెం శాన్తించాక   మెల్లగా అడిగింది ...ఎవరు తీసుకొచ్చారు కన్నా అని. ఎవరూ తీసుకురాలేదు..నేనే  నడిచి వచ్చేశా అని olympic medal నేనే గెలిచా అన్నట్టు చెప్పా. అంతే మళ్లీ ఏడుపు మొదలు..నిన్ను ఎవరాన్న దార్లో ఎత్తుకు పోయుంటే నేనేమయ్యేదాన్నిరో....మళ్లీ ఒక గంట పట్టింది ...తర్వాత నన్ను మెచ్చుకోవడం మొదలెట్టింది...నీకెంత ధైర్యం రా కన్నా....ఇలా...ఇంతలో ఎవరో దారిన పోయే దానమ్మ వెళ్తూ మీ పిల్లాడు  రాలేదన్నారు వచ్చేసాడా అని కుశల ప్రశ్నలు మొదలెట్టింది. మా అమ్మ అంది...చూసారా మా వాడు నడిచి వచ్చేసాడు ....మీ వాడు పగలు వీధి లో  తిరగాడానికే భయం ఆంటాడు... మా వాడు స్కూల్ నించి చీకటి పడిన తర్వాత  అంత దూరం ఒక్కడే నడిచి  వచ్చాడు...అని  గర్వంగా  చెప్పటం మొదలెట్టింది.....

ఇంతకి స్కూల్ నుండి మా ఇంటికి దూరం ఎంతని ఆడగరే?

అర  కిలో మీటర్

May 5, 2010

నా బాల్యం







అవి ఇంకా కంపూటర్లు కొంపలోకి రాని రోజులు. మనిషికో సెల్ ఫోన్ లేని రోజులు. సినిమా చూస్తూ మనసులో విలన్ ని బూతులు తిట్టుకున్న రోజులు.......అంటే టూకీగా మన చిన్నప్పటి రోజులు అన్నమాట...ఎంత చిన్నప్పుడు అంటే నేను ఒకటి నుండి నాలుగో తరగతి చదివిన రోజులు....

అప్పుడు మనం మా ఊళ్ళోని విద్యావిహార అనే RSS స్కూల్ లో చవివేవాళ్ళం. అది ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు దాక ఉండేది. అందులో చాలా మంచి విషయాలు నేర్పే వాళ్ళు. మద్యానం భోజనం చేయబోయే ముందు సంస్కృతం లో ఓ శ్లోకం చద్విన్చేవారు. సహన భవతు సహను భువంతు...... మొదటి తరగతి నుండి సంస్కృతం  కూడా ఒక సబ్జెక్టు. తర్వాత ఇంటర్లో చదివిన  సంస్కృతం అంతా  అప్పుడే నేర్పించేసారు. లంచ్ అయ్యాక నోటీసు బోర్డు లో ఒక సూక్తి రాసేవారు.  అది అందరూ సూక్తి పుస్తకం  లో రాయాలి. అది రాసామా  లేదా అని మర్నాడు చెక్ చేసే వాళ్ళు. సూక్తి రాయటం అయ్యాక  SPL (school people's leader)  స్కూల్ మధ్యలో  నిలబడి మైక్ లో భగవద్గీత చదివేవాడు. వాడి వెనకాలే మనం కూడా అరవాలన్నమాట ...అదయ్యాక చిన్న పిల్లలనందరికి పడుకోబెట్టే వాళ్ళు... మనం పడుకుంటామా?....క్లాసు లో ఎవడి పెన్సిల్ పెద్దది అనే competetions అన్ని అప్పుడే జరిగేవి. పెన్సిల్ అయ్యాక కణికెలు. ఇలా అన్నమాట.. దాని కోసం  రోజుకో పెన్సిల్ కొనమని ఇంట్లో పీడించుకుని తినడం. రోజుకో  పెన్సిల్ పడెయ్యడం, లేకపోతే ఎవడికో  దానం చెయ్యడం. ఇది విని మనం ఏదో పెద్ద దాన కర్ణ అనుకునేరు....కొంపదీసి.....వాడికి ఆ పెన్సిల్ ఇస్తే వాడు ఇంకొన్ని రోజులు ఆ పెన్సిల్ పట్టుకొస్తాడు... మనం  మర్నాడు కొత్త పెన్సిల్ తెచ్చేసి  వాడికి ఆ నాలుగు రోజుల నేనే  గొప్ప అని అనిపించుకోవచ్చు...అదన్నమాట ...ఇంకెప్పుడూ అలా అపార్థం చేసుకొకండే..... మూడింటికి లేచి ఆడుకోవడం నాలుగింటికి దుకాణం సర్దేసి కొంపకి చేరుకోవడంఅలా ఉండేది జీవితం.