Jun 10, 2010

పేదలు నిర్మూలింపబడ్డారు!!!

అద్బుతం అసామాన్యం అప్రతిహతం వగైరా వగైరా విశేషణాలన్నీ సరిగ్గా సరిపోయే సంఘటన ఒకటి ఈమధ్య జరిగింది. అదే...సారాయి దుకాణాల లైసెన్స్ వ్యవహారం. ప్రభుత్వ అధికారులే అదిరిపోయే మొత్తాలని దాఖలు చేసారు మన సారా వ్యాపారులు. వాళ్ళది వ్యాపార దృక్పధం. ఈరోజు సారా లో లాభం ఉంటే సారా అమ్ముతారు. రేపు బూడిద లో లాభం ఉంటే బూడిద అమ్ముతారు. వాళ్ళని ఏమి అనలేం. ఇక ఈ వ్యవహారం లో పాత్రధారులు ప్రజలు, ప్రభుత్వ అధికారులు, రాజకీయనాయకులు మిగిలారు. ఇందులో అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం. ప్రభుత్వ అధికారుల్ని ఎమన్నా అందామంటే....వాళ్ళకి రాజకీయ నాయకుల మీద విపరీతమైన స్వామి భక్తి. ఆ భక్తి పారవశ్యం లో అలా ప్రవర్తించడం తప్పంటారా..?? ముమ్మాటికీ కాదు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే..ఇదేంటండి రాష్ట్రం లో మద్యం వరదలై పారుతుంటే మీరేం చెయ్యట్లేదు సరికదా...దానికి వంత పాడుతున్నారేంటి అని అడిగిన ఒక పాత్రికేయుడికి మన ఎమెల్యే గారు ఇలా శెలవిచ్చారు....
    " పేదలని ఉద్దరించడానికి కోట్ల కొద్ది ధనం వెచ్చిస్తున్నాం. దాని వల్ల అసలు రాష్ట్రం లో పేదలే లేకుండా పోయారు. ప్రతిఒక్కరి దగ్గర కావలసినంత డబ్బు ఉంది. మరి డబ్బు ఉంటే జల్సా చెయ్యాలని అనిపిస్తుంది. అలాగే చేస్తున్నారు. పేదల్ని ఉద్దరించడం తప్పా ??"

అదీ ఇప్పుడు చెప్పండి తప్పని..చూద్దాం. ఇంత తెలివి ఉన్న రాజకీయ నాయకులని మనం తప్పని సరిగా వచ్చే ఎన్నికలలో గెలిపించాలి. ఇదంతా అన్యాయం అంటూ గొంతు చించుకుని వేలం పాట జరిగే చోట అరిచిన,బొత్తిగా లోక జ్ఞానం లేని,  లోక్ సత్తా నాయకులని ఓడించాలి. ఆదాయం తగ్గి పోయి నీరస పడిపోయిన ప్రభుత్వానికి ఏదో ఉడతా భక్తి గా సాయం చేయడానికి చీప్ లిక్కర్ రేటు పెంచితే ఊరికే గోల చేస్తారెందుకో ఈ ప్రజా సంఘాల వాళ్ళు. వీళ్ళకేమి పనీ పాటా ఉండదనుకుంటా. అసలు రేటు పెంచాక దాన్ని చీప్ లిక్కర్ అంటారెందుకో ఈ మతిలేనివాళ్ళు. చివరకి తెలిసోచ్చేదేమిటంటే.........
 రాష్ట్రం లో పేదలు సమూలంగా నిర్మూలిన్చబడ్డారు....
ఎందుకంటే ఎవరూ చీప్ లిక్కర్ తాగట్లేదు..అంతా బ్రాండెడ్ లిక్కర్ మాత్రమే తాగుతున్నారు. 
మరింకేం ఆలస్యం..పేదలందరూ నశించిన ఈ శుభసమయాన ఆనందం గా పాడండి.. మందేస్తూ చిందైరా...చిన్దేస్తూ మందైరా......

No comments:

Post a Comment